యంగ్టైగర్ ఎన్టీఆర్ , మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ప్రధాన పాత్రలలో దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా మార్చి 25న పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది.
సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో గత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు జక్కన్న అండ్ టీం. పంజాబ్.. ఢిల్లీ.. దుబాయ్.. బెంగుళూరు అంటూ వరుస ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహిస్తు్న్నారు.
19న కర్ణాటకలోని చిక్బళ్లాపూర్లో ప్రీరిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించిన తర్వాత వేగంగా ప్రమోషన్స్ చేస్తున్నారు ఎస్ఎస్ రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్. మార్చి 20న గుజరాత్లోని బరోడా, ఢిల్లీలో ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టగా, సోమవారం (మార్చి 21) పంజాబ్లోని అమృత్సర్, కోల్కత్తాలో పర్యటించింది ఈ చిత్రబృందం.
కోల్కతాలో ఆర్ ఆర్ ఆర్ని ప్రమోట్ చేసిన తర్వాత, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ , రాజమౌళి ఇప్పుడు వారణాసికి చేరుకున్నారు. వారణాసిలో గంగానది ఒడ్డున ప్రత్యేక పూజలు చేసి గంగా హారతిలో పాల్గొన్నారు.వీరితోపాటు రామ్ చరణ్ సతీమణి ఉపాసన, రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా పాల్గొన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ , రామ్చరణ్, రాజమౌళి వారణాసిలో గంగా నదిలో బోట్ రైడ్ కూడా చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యామాల్లో తెగ వైరల్ అవుతున్నాయి
VaRRRnasi ur were magical as always 🤗⭐️🙏
Super excited for #RRRMoive #RRR @AlwaysRamCharan pic.twitter.com/xzR57CwCLV— Upasana Konidela (@upasanakonidela) March 23, 2022