ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమాగా పిలుచుకునే రఘుపతి వెంకయ్య నాయుడు జీవిత నేపథ్యంలో సీనియర్ నటుడు నరేష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమాకి “రఘుపతి వెంకయ్య నాయుడు” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. బాబ్జీ దర్శకత్వంలో ఎల్లో లైన్ పిక్చర్స్ బ్యానర్పై మండవ సతీష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 29న విడుదల కానుంది. ఈ చిత్రంలో తణికెళ్ల భరణి, మహర్షి, వాహిని, సత్య ప్రియ, భావన, శక్తిమాన్, అఖిల్ సన్నీ, మునిచంద్ర, సాయికాంత్, చాణక్య, దేవ్ రాజ్ తదితరులు నటించారు. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్ను సూపర్స్టార్ మహేశ్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. యూనిట్ అందరికి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా కోసం రఘుపతి వెంకయ్యగారు చేసిన కృషిని గుర్తు చేయడానికి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు పేర్కొనగా, ‘రఘుపతి వెంకయ్యగారి పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం ఇది. తెలుగు సినిమా బతికున్నంత వరకూ ఈ చిత్రం అందరికీ గుర్తుండిపోతుంది’ అని నరేష్ అన్నారు. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.
next post