telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహేష్ బాబు సినిమాలో ‘సాహో’ బ్యూటీ

sraddakapoor

ఇటీవలే ‘సాహో’ సినిమాతో తెలుగు చిత్రంలోకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్. ఆమెకు టాలీవుడ్ నుంచి మరో ఆఫర్ దక్కిందని తెలుస్తోంది. ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించిన మహేష్ బాబు తన తదుపరి సినిమాను పరశురామ్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ లాక్‌డౌన్ ఫినిష్ కాగానే పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ మూవీ స్టార్ట్ చేయనున్నారట. దీంతో ఈ సారి మహేశ్ బాబుతో జోడీ కట్టే హీరోయిన్ ఎవరనే దానిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్‌ని ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు- పరశురామ్ కాంబోలో రూపొందనున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ కేటాయించి ప్యాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. పైగా హీరోయిన్ క్యారెక్టర్ హైలైట్ అయ్యేలా స్క్రిప్ట్ రూపొందిస్తున్నారట డైరెక్టర్ పరశురామ్. అందుకే బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్‌ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.

Related posts