telugu navyamedia
ఆంధ్ర వార్తలు

దొంగ పోలీసుతో నా హత్యకు కుట్ర -ఎంపీ రఘురామ

ఏపీ ప్రభుత్వంపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగ పోలీసుతో తనను హత్య చేసి వేరే అకౌంట్‌లో రాయాలని చూశారని రఘురామ ఆరోపించారు.

రామకృష్ణారెడ్డి అనే అధికారికి తన ఇంటి ముందు ఏం చేస్తున్నారని డీజీపీకి లేఖ రాసినట్లు చెప్పారు. ఇప్పటివరకు డీజీపీ స్పందించలేదని ఎంపీ రఘురామ అన్నారు. విచారణ జరపాలని కేంద్రహోంశాఖ సెక్రటరీకి లేఖ రాసినట్లు రఘురామ తెలిపారు

ఝర్ఖండ్ వ్యక్తులతో తనను చంపించేందుకు ప్రయత్నం జరుగుతోందని రఘురామ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అధికార దుర్వినియోగానికి మారుపేరుగా మారిన సీబీసీఐడీ ఏడీజీ పీవీ సునీల్ కుమార్.. సీఎం జగన్ తో కుమ్మక్కై తనను అంతమొందించేందుకు కుట్ర పన్నుతున్నారని ఎంపీ రఘురామరాజు ఆరోపించారు.దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీకి రెండు పేజీల లేఖ రాశారు.

అరెస్ట్ చేసి కస్టడీలో ఉండగా.. గుంటూరు జైలులో తనను చంపేందుకు కుట్రపన్నారని.. సీఎం నిర్ణయాలను విమర్శిస్తున్నాననే భౌతిక దాడికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తనను చంపే కుట్రలో సజ్జల కూడా ఉన్నారన్నారు. ఈ కుట్రపై ఎన్ఐఏ వంటి సంస్థతో విచారణ జరిపించాలని ఎంపీ రఘురామ అన్నారు.

 

Related posts