telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

అవినాష్ ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండాలి : కేశినేని

రాష్ట్ర తెలుగు యువత  అధ్యక్ష్య పదవి తీసుకొని సొంత స్వార్ధం కోసం, పార్టీని తాకట్టు పెట్టి అధికారం మారగానే ఇంకొకరికి పాలాభిషేకం చేస్తున్నాడు దేవినేని అవినాష్ అంటూ ఎంపీ కేశినేని వ్యాఖ్యానించారు. రౌడీయిజం, గూండాయిజం చేయడానికి పాత రోజులు కాదన్న ఆయన బెజవాడ రౌడీయిజం చిన్నపుడే చూశానని అన్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోయారని నెహ్రూ ఓటర్లను కొట్టించారు, ఇప్పుడు టీడీపీ మహిళా అభ్యర్థిని పోటీ చేయవద్దని అవినాష్ దాడి చేయించారని నాని అన్నారు. అవినాష్ ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండాలని ఆయన అన్నారు. విజయవాడలో ఎంపీ కేశినేని నాని మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 37వ డివిజన్‌ టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి వినోద్‌జైన్‌తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి… మున్సిపల్‌ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. విజయవాడ మున్సిపాలిటీలో 20ఏళ్లుగా అభివృద్ధి అన్న మాటే లేదని చెప్పారు. పైగా ప్రజలంతా అధిక ధరలతో ఇబ్బందులు పడుతున్నారని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్య కూడా ఎక్కువగా ఉందన్నారు కేశినేని నాని. టీడీపీ అధికారంలోకి వస్తే… ఇంటి పన్ను రూపాయి కూడా పెంచకుండా చేస్తామని హామీ ఇచ్చారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts