telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నామినేషన్ వేసిన టీడీపీ అభ్యర్థి

TDP Candidate withdraw Badwel

ఏపీ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది విడుదల చేశారు. 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. పెనమలూరు టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ సోమవారం నామినేషన్ వేశారు. పోరంకిలోని తన కార్యాలయం నుంచి భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేశారు. ర్యాలీలో ఎంపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణ, వంగవీటి రాధా, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు గడువు ఈ నెల 25తో ముగియనుంది. 26వ తేదీన నామినేషన్ల పరిశీలన, 27 నుంచి 28 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. ఏప్రిల్‌ 11న పోలింగ్‌ అనంతరం మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Related posts