తెలంగాణలోని మహబూబ్నగర్, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ప్రధాని నరేంద్రమోడి శుక్రవారం పర్యటించనున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్కు మధ్యాహ్నం 2.20 గంటలకుచేరుకుంటారు. అక్కడ బహిరంగ సభ ముగించుకొని సాయంత్రం కర్నూలులోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జరిగే సభా ప్రాంగణానికి వెళతారు.
సాయంత్రం 4.30 నుంచి 5.15గంటల వరకు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఏపీఎస్పీ మైదానం నుంచి ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుని విమానంలో ఢిల్లీ కి బయలుదేరివెళ్తారు. అయితే ఈ సందర్భంగా మోదీ ఇక్కడి ప్రజలను ఉద్దేశించి తెలుగులో ట్వీట్ చేశారు. బహిరంగ సభలో పాల్గొనాల్సిందిగా ఆ పరిసరాల ప్రాంతాల్లోని ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమం కోసం ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తానని తెలిపారు.