లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆయా పార్టీలు గెలుపొందే సీట్లపై సర్వే సంస్థలు ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉంటాయి. ఇందుకు సంబంధించి వివిధ మీడియా సంస్థలో కథనాలు వస్తున్నాయి. రాజకీయ నేతలు కూడా గెలుపు ఓటములపై తమ అంచనాలను వెల్లడిస్తుంటారు. తాజాగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లోక్ ఎన్నికలకు సంబంధించి జోస్యం చెప్పారు.
కోల్ కతాలో టీఎంసీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆమె మాట్లాడుతూ 200 సీట్లకు మించి బీజేపీ గెలవలేదని ఆమె అన్నారు. ఇంకా చెప్పాలంటే కనిష్ఠంగా 135 సీట్లకే పరిమితం కావచ్చని చెప్పారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలపై రూపొందించిన ఓ నివేదికను చదివి వినిపించారు. ఈ నివేదిక ప్రకారం ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని మొత్తం 193 లోక్ సభ స్థానాల్లో బీజేపీకి కేవలం 5 నుంచి 10 మాత్రమే సీట్లు వస్తాయని వెల్లడించారు.