telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఒవైసీ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన రాజాసింగ్

BJP-MLA Raja-Singh

అయోధ్యలోని వివాదాస్పద భూమి హిందువులదేనని సుప్రీం కోర్టు ఇచ్చిన అంతిమ తీర్పుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ 2.0 ప్రణాళిక భారత్ ను హిందూ దేశంగా మార్చేందుకు ఉద్దేశించిందని ఒవైసీ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటుగా స్పందించారు.

ఒవైసీ తన ప్రకటనల ద్వారా భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఒవైసీని అరెస్ట్ చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేస్తున్నట్టు రాజాసింగ్ ట్వీట్ చేశారు. రామమందిరం అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఇరువర్గాల ప్రజలు అంగీకరిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ లోనే కాదు, మరే ఇతర నగరంలోనూ శాంతికి భంగం వాటిల్లాలని తాము కోరుకోవడం లేదని అన్నారు.

Related posts