విశాఖలోని ఆర్కే బీచ్లో నేవీ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఏపీ సీఎం జగన్ హాజరై విన్యాసాలు తిలకించారు. విన్యాసాలు చూసేందుకు పెద్ద ఎత్తున నగర ప్రజలు, పర్యాటకులు తరలివచ్చారు. విన్యాసాలు ప్రజలను అబ్బురపరిచాయి. ఈ వేడుకల్లో తూర్పు నావికా దళాధిపతి అతుల్ కుమార్ జైన్ పాల్గొన్నారు.
1971లో పాకిస్తాన్పై యుద్దంలో గెలుపు సాధించడానికి తూర్పు నావికా దళం కీలక పాత్ర పోషించింది. పాకిస్తాన్పై గెలుపుకు ప్రతీకగా ఏటా డిసెంబర్ 4న నేవీ డే ను నిర్వహిస్తారు. తూర్పు నావికా దళం ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్లో నేవీ డే ఘనంగా నిర్వహించారు.