దేశంలోనే తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈఎస్ఐ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ ను కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి కేటీఆర్ తదితరులు పాల్గొన్నారు. ఐక్లీన్, ఐ సేఫ్ సంస్థల సహకారంతో డీఆర్డీవో ఈ ల్యాబ్ను తయారుచేసింది. కరోనా పరీక్షలతోపాటు, వైరస్ కల్చర్, వ్యాక్సిన్ తయారీపై ఈ ల్యాబ్ పనిచేయనుంది.
ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కరోనా కట్టడికి త్రిముఖ వ్యూహం అనుసరిస్తున్నామని వెల్లడించారు. కేవలం ఇరవై రోజుల్లోనే గచ్చిబౌలిలో 1500 పడకలతో టిమ్స్ ను ఏర్పాటు చేశామని అన్నారు. కోవిడ్-19 చికిత్స కోసం ఎనిమిది ప్రత్యేక హాస్పిటళ్లను ఏర్పాటుచేశామని చెప్పారు. కేంద్ర మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలుచేస్తున్నామని చెప్పారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
రామ మందిర విరాళాల సేకరణపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు…