ఏపీ సీఎం జగన్ ఢిల్లీ నుంచి తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథిగృహం వద్ద సీఎంకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఘన స్వాగతం పలికారు. అంతకుముందు ఢిల్లీ పర్యటన ముగించుకుని రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్న సీఎం జగన్కు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మరికాసేపట్లో పద్మావతి అతిథి గృహం వద్ద నుంచి సీఎం జగన్ అన్నమయ్య భవన్కు చేరుకోనున్నారు.
కరోనాపై ప్రధాని మోదీతో జరిగే సమీక్షా సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్, హోంమంత్రి సుచరిత, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పాల్గొననున్నారు. సాయంత్రం 6.15 నిమిషాలకు ఆంజినేయ స్వామి దేవాలయం వద్దకు సీఎం చేరుకోనున్నారు. అక్కడ నుంచి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకొని స్వామి వారికి ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.