ఇంటర్మీడియట్ ఫలితాలను ఏపీ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేయనుంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే పరీక్షల్లో ఫేయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు, ఇంప్రూవ్ మెంట్ పరీక్షల తేదీలను మాత్రం ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు.
పరీక్షల ఫలితాలను విడుదల చేసిన తర్వాత అధికారులు సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ప్రకటించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉన్నప్పటికీ, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ లెక్షరర్లు మూల్యాంకనాన్ని పూర్తి చేశారు. దీంతో ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి.
బీజేపీలో చేరిన వారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదరిస్తారా: చంద్రబాబు