ఈ రోజు జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత కళా వెంకట్రావు స్పందించారు. క్యాబినెట్ నిర్ణయాలు కక్ష సాధింపు, పొలిటికల్ బ్లాక్మెయిలింగ్ కొనసాగించే విధంగానే ఉన్నాయని తప్పుబట్టారు. సాక్షి పత్రికకు రూ.కోట్ల యాడ్స్పైనా సీబీఐ విచారణ జరపాలని కళా వెంకట్రావు డిమాండ్ చేశారు.
ఇళ్ల స్థలాలు, ఇసుక, మద్యంలో జరుగుతున్న అవినీతిపై సీబీఐ విచారణ ఎందుకు వేయలేదు? అని ప్రశ్నించారు. సరస్వతీ పవర్కు భూముల కేటాయింపుపై సీబీఐ విచారణ ఎందుకు వేయలేదని నిలదీశారు. హెరిటేజ్ ఏనాడూ చట్ట వ్యతిరేక, ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేయలేదని తెలిపారు.