telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ముగిసిన ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు

Pranab mukarji

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఢిల్లీలోని లోథీ శ్మశానవాటికలో ఆయనకు పూర్తిస్థాయి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రణబ్ పార్థివదేహంపై జాతీయ పతాకాన్ని ఉంచిన సైనికులు, గౌరవసూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు.

సంప్రదాయం ప్రకారం కుమారుడు అభిజిత్ ముఖర్జీ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు రాజాజీ మార్గ్ నివాసం వద్ద ప్రణబ్ భౌతికకాయాన్ని ప్రముఖులు చివరిసారి సందర్శించి పలువురు ప్రముఖూ నివాళులు అర్పించారు.

గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో భాదపడుతూ ప్రణబ్ ఆసుపత్రిలో చేరారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆయఙ్కు కు శస్త్రచికిత్స నిర్వహించారు. అయితే, ఆ శస్త్రచికిత్స అనంతరం ఆయన పరిస్థితి విషమించింది. దీంతో నిన్న సాయంత్రం ప్రణబ్ తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు.

Related posts