ఈరోజు సీఎం కేసీఆర్ కేబినెట్ భేటీ కాబోతున్నది. రేపు రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్న తరుణంలో ఈ భేటీ కీలకంగా మారింది. ఈరోజు సాయంత్రం 7 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ అవుతుంది. సభలో ప్రవేశపెట్టే బడ్జెట్ తో పాటుగా, ప్రవేశపెట్టబోయే బిల్లులు, వాటి ఆమోదం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా అని విషయంపై చర్చించబోతున్నారు. ఏపీలో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై కూడా చర్చించే అవకాశం ఉన్నది. సంక్షేమ పథకాల అమలు తీరు ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నది. అలాంటి వ్యవస్థ తెలంగాణలో లేకపోవడం వలన వస్తున్న ఇబ్బందులు వాటి పరిమాణాలు తదితర అంశాలపై కూడా ఈరోజు సాయంత్రం జరిగే భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అయిన విషయం తెలిసిందే. సోమవారం రోజున గవర్నర్ ప్రసంగం జరిగింది. నిన్నటి రోజున సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. కాగా, ఈరోజు గవర్నర్ ప్రసంగంపై తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.
previous post