telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కంటితుడుపు కమిటీలతో ఎలాంటి ప్రయోజనం లేదు: అశ్వత్థామరెడ్డి

ashwathama reddy

కంటితుడుపు కమిటీలతో ఎలాంటి ప్రయోజనం లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. సమ్మెలో భాగంగా బుధవారం దిల్‌సుఖ్‌ నగర్‌ బస్టాండ్‌లో ఆర్టీసీ ధూం ధాం కార్యక్రమంలో అశ్వత్థామరెడ్డి సహా పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్‌కు దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు.

ప్రభుత్వ ప్రకటనలు కార్మికులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నట్లుగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. ఆర‍్టీసీ కార్మికులకు సంబంధించి ఏ ఒక్క డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. 2004లో టీడీపీ ఓటమికి ఆర్టీసీ సమ్మె కారణమని ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి గుర్తు చేశారు. తాము ప్రతిపాదించిన 26 డిమాండ్లు తమకు ప్రాధాన్యమే అని అన్నారు. ధనిక రాష్ట్రంలో ధనం ఏమైందని, అదే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు.

Related posts