అమరావతి రైతులు రోడ్డెక్కడానికి చంద్రబాబే కారణమని ఏపీ మంత్రి కన్నబాబు అన్నారు. ఏపీ రాజధానిపై కొనసాగుతున్న గందరగోళంపై ఆయన స్పందించారు. ఏపీ రాజధాని అమరావతి కాదని ముఖ్యమంత్రి జగన్ ఎక్కడైనా చెప్పారా? అంటూ గందరగోళాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లారు. హై పవర్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే రాజధానిపై జగన్ నిర్ణయం తీసుకుంటారని మంత్రి చెప్పారు.
కమిటీల నివేదికలను అసెంబ్లీలో చర్చించిన తర్వాతే జగన్ స్పష్టమైన ప్రకటన చేస్తారని తెలిపారు.శివరామకృష్ణన్ కమిటీ నివేదికను తుంగలో తొక్కి చంద్రబాబు అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశారని కన్నబాబు విమర్శించారు. రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు.