కుప్పంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కుప్పంలో వైసీపీ శ్రేణుల దాడులకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి చంద్రబాబునాయుడు గురువారం నాడు నిరసనకు దిగారు.
కుప్పంలో నేడు ప్రారంభించనున్న అన్నా క్యాంటిన్ ను వైఎస్ఆర్ సీపీ నేతలు ధ్వంసం చేయడంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబునాయుడు తాను బస చేసిన గెస్ట్ హౌస్ నుండి కాలినడకన అన్న క్యాంటీన్ వద్దకు చేరుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు
వైఎస్ఆర్ సీపీ నేతల తీరుకు నిరసనగా ప్రస్తుతం కుప్పం రెండో రోజు పర్యటనలో ఉన్న ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
కాగా అంతకుముందు.. చంద్రబాబు పర్యటనలో భాగంగా.. వైసీపీ శ్రేణులు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో టీడీపీకార్యకర్తలు ఏర్పాటు చేసిన ప్లెక్సీలను.. వైసీపీ కార్యకర్తలు చించివేశారు. అలాగే ప్యాలెస్ రోడ్డులో ఉన్న తెలుగుదేశానికి సంబంధించిన బ్యానర్లు, కౌటౌట్లు ధ్వంసం చేశారు.
దీంతో కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ శ్రేణుల అరాచకానికి అన్న క్యాంటిన్ వద్ద చంద్రబాబు నిరసన వ్యక్తం చేస్తున్నారు.