telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

విత్తనాల కొరత  పరిష్కరించాలి.. బీజేపీ నేత కన్నా డిమాండ్

Kanna laxminarayana

ఏపీ సర్కార్ పై  ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విరుచుకుపడ్డారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పై మండిపడ్డారు. నూతన ఇసుక పాలసీ విషయంలో సీఎం జగన్ రెండు అడుగులు ముందుకు-నాలుగు అడుగులు వెనక్కు వేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుతం తీవ్రమైన విత్తనాల కొరత నెలకొందనీ, ఈ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని  కన్నా డిమాండ్ చేశారు. 

రాష్ట్రంలో  తీవ్రమైన వర్షాభవ పరిస్థితులు, కరవు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో  వెంటనే  కరవు నివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు.  కర్ణాటకలో అంతర్గత కుమ్ములాటలు, అపవిత్ర పొత్తు కారణంగానే కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కూలిపోయిందని స్పష్టం చేశారు. ఇందులో తమ పార్టీ ప్రమేయం  లేదని కన్నా స్పష్టం చేశారు.

Related posts