*కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థతి
*కుప్పం చరిత్ర లో ఇదొక బ్లాక్ డే..
*నేను బ్రతికి ఉన్నంతవరకు మీరేమీ చేయలేరు.
*కుప్పంలో ఎప్పుడైనా రౌడీయిజం చూశారా?
*ధర్మ పోరాటం ఇక్కడ నుంచే మొదలు పెడుతున్నాం..
*ఖబడ్దార్ మిస్టర్ జగన్ రెడ్డి
*మిస్టర్ ఎస్పీ ఎక్కడ నువ్వు..
*జగన్కు దమ్ముంటే కుప్పం రావాలి..నేను రేపు కూడా ఇక్కడే ఉంటా..
కుప్పం చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అన్నారు. కుప్పం నుండే ధర్మపోరాటం చేస్తానని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రకటించారు.
గురువారం నాడు అన్న క్యాంటీన్ వద్ద నిరసన తర్వాత టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రసంగించారు. కుప్పంలో చోటు చేసుకున్న ఘటనలు చూస్తే రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతుందన్నారు.
కుప్పంలో రౌడీయిజం చూశారా అని చంద్రబాబు ప్రశ్నించారు. నాపైనే దాడికి దిగుతున్నారు, మీరో లెక్కా అని ప్రజలను చంద్రబాబు అడిగారు.
వైసీపీ సర్కార్ రాష్ట్రంలో వీధికో రౌడీని తయారు చేసిందని మండిపడ్డారు. అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ను ధ్వంసం చేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఖబడ్దార్ మిస్టర్ జగన్రెడ్డి అంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
కుప్పం నుంచే ధర్మపోరాటం మొదలుపెట్టానని, తనపైనే దాడి చేయాలని ప్రయత్నించారని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పోలీసుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. పోలీస్ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్నారు. అయితే కొందరు పోలీసుల తీరును చంద్రబాబు తప్పు బట్టారు. ఇంత జరుగుతున్న మిస్టర్ ఎస్పీ ఎక్కడున్నావని చంద్రబాబు ప్రశ్నించారు. సీఎం చేతిలో పోలీసులు కీలుబొమ్మలుగా మారారన్నారు .పోలీస్ వ్యవస్థ సక్రమంగా పని చేయకపోతే ప్రజా తిరుగుబాటు అనివార్యం జరుగుతుందని చంద్రబాబు తేల్చి చెప్పారు.
అక్రమ కేసులకు భయపడతామనుకుంటున్నావా? పిల్లిని కూడా రూమ్లో పెట్టి కొడితే పులి అవుతుందని అన్నారు. నేను బ్రతికి ఉన్నంతవరకు మీరేమీ చేయలేరని సీఎం జగన్ మోహన్ రెడ్డిని’’ మరోసారి చంద్రబాబు హెచ్చరించారు.
ఏపీ భవిష్యత్తు అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది: సోమిరెడ్డి