టాలీవుడ్ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు పై విరుచుకుపడ్డాడు. గురువారం ఆయన వైసీపీ మద్దతుగా భీమవరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందరర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన చంద్రబాబు 11 కేసులను తొక్కిపట్టిన గజదొంగ అని విమర్శించారు. అటువంటి వ్యక్తికి మరోసారి అవకాశమిస్తే రాష్ట్రం అథోగతేనంటూ ధ్వజమెత్తారు. సైకిల్కు అసలు స్టాండే లేదని, మనకు ఏసీ ఉన్నా ఫ్యానే కావాలని ఆయన అన్నారు. అందరూ వైసీపీ నేతలకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు.
చంద్రబాబు రాష్ట్రాన్ని దోచేసిన గజదొంగ మోహన్ బాబు అన్నారు. ఆయన ఐదేళ్ల పాలన దోచుకో, దాచుకో అన్నట్లుగానే సాగిపోయిందన్నారు. టీడీపీకి ఓట్లు వేస్తే మురిగిపోతాయరన్నారు. చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకుని కొన్ని పార్టీలు వస్తున్నాయని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అని మోహన్ బాబు మండిపడ్డారు. ప్రజల ఆశీస్సులతో జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీకి ఈసారి తీవ్ర పరాభవం: చంద్రబాబు