telugu navyamedia
ఆంధ్ర వార్తలు

త‌న‌ భర్త హత్యకు ఎమ్మెల్యే వెంకట్రావే కారణం: గంజి ప్రసాద్ భార్య సంచలన ఆరోపణలు..

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో వైసీపీ గ్రామ అధ్యక్షుడు గంజి ప్రసాద్‌ హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది…

తన భర్త హత్యకు ఎమ్మెల్యే వెంకట్రావే కారణమని గంజి ప్రసాద్ భార్య సత్యవతి సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఎంపీటీసీ బజారియా, అతని అనుచరులు తన భర్తను హత్య చేశారన్నారు.

ఎమ్మెల్యే తలారి వెంకట్రావును వెంటనే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. హోంమంత్రి వనితకు తన భర్త గంజి ప్రసాద్ అనుచరుడు అని ఆమె వెల్లడించారు. ఇకపై వాళ్ల ఆటలు సాగవని… ఎమ్మెల్యేనే హత్య చేయించారని స్పష్టం చేశారు.

తన భర్త గంజి ప్రసాద్‌ హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వేడుకున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయాం.. మా కుటుంబానికి రూ.5 కోట్ల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు గంజి సత్యవతి. తమకు న్యాయం జరిగేంత వరకూ గంజి ప్రసాద్‌ మృతదేహాన్ని తరలించేబోమని సత్యవతి స్పష్టం చేశారు.

Related posts