telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ

జగన్ తో మోత్కుపల్లి .. భేటీ..

motkupalli meet jagan today

ఈరోజు వైసీపీ అధినేత జగన్ తో తెలంగాణ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉన్న జగన్ నివాసానికి మోత్కుపల్లి వచ్చారు. ఆయన్ను వైసీపీ నేతలు సాదరంగా లోపలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణలో రాజకీయ పరిస్థితులతో పాటు భవిష్యత్ కార్యాచరణపై జగన్ తో ఆయన సుదీర్ఘంగా చర్చించారు.

మోత్కుపల్లి ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానిస్తే టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమని ప్రకటించారు. అంతేకాకుండా ఏపీ సీఎం చంద్రబాబుపై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో జగన్ తో ఈరోజు మోత్కుపల్లి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Related posts