telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు తొత్తులు ఎస్పీలుగా ఉన్నచోట హింస: విజయసాయిరెడ్డి

YCP Vijayasai Reddy Fire Chandrababu

సీఎం చంద్రబాబు తొత్తులు ఎస్పీలుగా ఉన్నచోట్లే హింస జరిగిందని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలో సీఈసీని వైసీపీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా విజయసాయి మీడియాతో మాట్లాడుతూ పలుచోట్ల టీడీపీ నేతలు హింసకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందన్నారు. చంద్రబాబు మాటల్ని జాతీయ పార్టీలు నమ్మవద్దని ఆయన సూచించారు.

సానుభూతి కోసమే స్పీకర్ కోడెల శివప్రసాదరావు తానే చొక్కా చించుకున్నారని ఆయన మండిపడ్డారు. ఈ- ప్రగతి విషయంలో అధికార దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఓటింగ్‌ మిషన్లు పనిచేయకపోవడం వల్లే.. అర్థరాత్రి వరకు సమయం పొడిగించారని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.

Related posts