telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

83వ రోజుకు చేరుకున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర

కర్నూలు : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 83వ రోజుకు చేరుకుంది. నేడు మంత్రాలయం నుంచి ఎమ్మిగనూరు నియోజక వర్గంలోని నందవరం మండలంలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది. ఇబ్రహీంపట్నం చర్చి వద్ద స్థానికులతో నారా లోకేష్ సమావేశం కానున్నారు. కొట్టాల క్రాస్ వద్ద నది కైరవాడ గ్రామస్తులతో భేటీ జరగనుంది. మాచాపురం శివారులో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు. సాయంత్రం మాచాపురంలో ఎస్సీలతో సమావేశం కానున్నారు. నందవరం చర్చి వద్ద స్థానికులతో సమావేశం జరగనుంది. నందవరం శివారు విడిది కేంద్రంలో నారా లోకేష్ రాత్రికి బస చేయనున్నా

Related posts