సినీపరిశ్రమలో అరంగేట్రం చేసిన అనతికాలంలో బాలీవుడ్లో అగ్ర కథానాయికగా ఎదిగింది కియారా అద్వాణీ. ‘ధోనీ’ ‘కబీర్సింగ్’ చిత్రాలతో తిరుగులేని ఫాలోయింగ్ను సంపాదించుకుంది. తెలుగులో ‘వినయ విధేయ రామ’ ‘భరత్ అనే అనే’ చిత్రాల్లో ప్రేక్షకుల్ని మెప్పించింది. ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. అయితే.. తాజాగా కియార తన కెరీర్ ఆరంభ రోజుల గురించి చెప్పింది. తన తొలి సినిమా తీవ్ర నిరాశను కలిగించిందని తనకు రెండో అవకాశం వస్తుందని కూడా ఊహించలేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కియార పేర్కొంది. అందరూ తన తొలి సినిమా “ధోని” అనుకుంటున్నారని.. కానీ తన ఫస్ట్ మూవీ 2014 లో వచ్చిన “ఫగ్లీ” అని తెలిపింది. ఆ సినిమా ఫ్లాప్ అవడంతో.. తన ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బ తిన్నదని పేర్కొంది కియారా. తనకు రెండో అవకాశం వస్తుందని కూడా అనుకోలేదని.. తన కెరీర్ ఇక ముగిసిందని నిరాశలో కూరుకుపోయానని చెప్పింది ఈ భామ. ఆ తర్వాత ఎన్నో ఆడిషన్లు ఇచ్చినా.. అవకాశం రాలేదని తెలిపింది. చివరికి తనకు “ధోనీ” సినిమా అవకాశం వచ్చిందని.. దీంతో తన కెరీర్ మారిపోయిందని తెలిపింది. ఇప్పుడు తన కెరీర్ అద్భుతంగా ముందుకు పోతుందని కియారా పేర్కొంది. మరి తన తర్వాతి తెలుగు సినిమా ఏంటి అనేది చూడాలి.
previous post
next post