telugu navyamedia
రాజకీయ వార్తలు

ఢిల్లీ పర్యటనలో కేసీఆర్.. సాయంత్రం మోదీతో భేటీ !

KCR cm telangana

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీతో కేసీఆర్ భేటీ కావాల్సి ఉంది. కానీ, ఆయన షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. సాయంత్రం 4.30 గంటలకు మోదీతో ఆయన భేటీ అవుతారు.

మధ్యాహ్నం 1.30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు. ఈ భేటీల సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో కేసీఆర్ చర్చించనున్నారు. ఏదైనా ఒక నీటి పారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదాను ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. అనంతరం సాయంత్రం సాయంత్రం మోదీతో కేసీఆర్ భేటీ అవుతారు.

Related posts