హైదరాబాద్ ‘మెట్రో’ను కలుపుతూ బస్సులు నడుతాయన్న వార్తలు మొత్తానికి కార్యరూపం దాల్చాయి. మెట్రో ప్రయాణాన్ని మరింత సులభతరం చేయాలన్న ఉద్దేశంతో ఉచిత షటిల్ బస్సు సర్వీస్ లను ఎల్ అండ్ టీ ‘మెట్రో’ ప్రారంభించింది. దుర్గంచెరువు నుంచి హైటెక్ సిటీ, గచ్చిబౌలికి ఈ బస్సు సర్వీస్ లు నడుస్తాయి.
‘ఫస్ట్ అండ్ లాస్ట్’ కనెక్టివిటీలో భాగంగా మెట్రో స్టేషన్స్ నుంచి కార్యాలయాలకు కనెక్టింగ్ సర్వీస్ లను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. కాగా, ‘మెట్రో’ ఉచిత షటిల్ బస్సు సర్వీస్ సౌకర్యం కల్పించడంపై ప్రయాణికులు, ముఖ్యంగా ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ గారూ మీరు ఏపీకి సీఎం.. సాక్షి పేపర్ చదవడం మానేయండి?: నారా లోకేశ్