telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఉత్తరాఖండ్ సీఎంతో శ్రీ శారదా పీఠం ఉత్తర పీఠాధిపతులు భేటీ

ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లారు విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతి. ఈ పర్యటనలో ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ తో స్వాత్మానందేంద్ర సరస్వతి భేటీ అయ్యారు. హరిద్వార్ కుంభమేళాలో పీఠం చేపడుతున్న సేవలను సీఎంకు వివరించిన స్వామీజీ…. చార్ ధామ్ క్షేత్రాల్లో నిత్యం వేద పారాయణ చేపడుతున్నట్టు వెల్లడించారు స్వామి స్వాత్మానందేంద్ర.
ఉత్తర భారతదేశంలో వేద విద్యాభ్యాసానికి ప్రాధాన్యత తక్కువగా ఉందని ఉత్తరాఖండ్ సీఎం వద్ద ప్రస్తావించిన స్వామి స్వాత్మానందేంద్ర… ఉత్తరాఖండ్ లో వేద పాఠశాల ఏర్పాటుకు విశాఖ శ్రీ శారదా పీఠం సుముఖంగా ఉందని త్రివేంద్ర సింగ్ రావత్ తో చెప్పారు స్వామి స్వాత్మానంద. డెహ్రాడూన్ లో స్థలం కేటాయిస్తే సాధువులు, సామాన్యుల కోసం కంటి ఆసుపత్రిని నిర్మిస్తామన్న స్వామిజీ…
కంటి వైద్య సేవలు, ఆపరేషన్లు ఉచితంగా అందిస్తామని స్వామి స్వాత్మానందేంద్ర హామీ ఇచ్చారు. ఏటా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు చాతుర్మాస్య దీక్షను ఉత్తరాఖండ్ లోనే చేపడతారని ఉత్తరాఖండ్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు స్వామి స్వాత్మానందేంద్ర.

Related posts