తమ పై జరిగిన దాడిని నిరసిస్తూ పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. నిరసనను నిలిపివేసి నాలుగు గంటల్లోగా విధుల్లో చేరాలని డాక్టర్లను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించింది. కోల్కతాలోని ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో మూడు రోజుల క్రితం ఓ రోగి మృతి చెందాడు. దీంతో రోగి బంధువులు జూడాలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ ఘటనకు నిరసనగా గత మూడు రోజుల నుంచి జూడాలు ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లను పోస్టర్ల రూపంలో ప్రభుత్వానికి తెలియజేశామని, తమకు న్యాయం చేయాలని జూడాలు డిమాండ్ చేశారు. .
దీంతో ఆందోళనకు దిగిన జూడాల వద్దకు సీఎం మమతా బెనర్జీ వెళ్లారు. తమకు న్యాయం కావాలని సీఎం ఎదుట జూడాలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. ఎవరైతే విధుల్లో చేరాలనుకోవడం లేదు వారు ఆస్పత్రి నుంచి వెళ్లిపోవచ్చని ఆమె స్పష్టం చేశారు. విధుల్లో చేరని వారు బయటి వారు అని పేర్కొన్నారు. ఇలాంటి నిరసనలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోదని తేల్చిచెప్పారు.
ఇక చంద్రబాబు కుంభకోణాలన్ని వెలుగులోకి వస్తాయి: విజయసాయి