telugu navyamedia
క్రైమ్ వార్తలు

బ్యూటీపార్లర్‌కు వెళ్లిన యువతి అదృశ్యం..

హైదరాబాద్‌లో బ్యూటీపార్లర్‌కు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైంది. ఈ ఘటన చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. నగరంలోని దోమల్‌గూడకి చెందిన జి.దుర్గాప్రసాద్, భార్గవి(26) భార్యాభర్తలు. భార్గవి నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది. అయితే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్న భార్గవికి సంవత్సరం క్రితమే వివాహమైంది.

వివర్లాలోకి వెళితే..

దోమలగూడ గగన్‌మహల్‌లో నివసించే జి.దుర్గాప్రసాద్, భార్గవి(26) భార్యాభర్తలు. భార్గవి బుధవారం సాయంత్రం 5.30 సమయంలో సమీపంలోని బ్యూటీపార్లర్‌కు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది.సాయంత్రం 6.30కు భార్గవి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ రావడంతో దుర్గాప్రసాద్‌ బ్యూటీపార్లర్‌కు వెళ్లి వాకబు చేశాడు. ఆమె అక్కడ లేకపోవడంతో బంధువులు, స్నేహితులను సంప్రదించాడు.

భార్గవి ఆచూకీ లేకపోవడంతో దుర్గాప్రసాద్‌ చిక్కడపల్లి పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమీపంలోని పలు ప్రాంతాల్లో ఆమె నడుచుకుంటూ వెళ్తున్న సీసీ టీవీ దృశ్యాలను గుర్తించారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ ప్రేమ్‌కుమార్‌ కోరారు.

Related posts