telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్ లో మాదకద్రవ్యాలు స్వాధీనం

గత కొంతకాలంగా హైదరాబాద్ నగరంలో గుటుచప్పుడుకాకుండా ఏదో ఒక ప్రాంతంలో మాదకద్రవ్యాల విక్రయాలు జరుగుతున్నాయి. తాజాగా నగరంలోని ఫిల్మ్‌నగర్‌లో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఇద్దరు నిందితుల వద్ద 8 సీసాల మత్తు ద్రావణాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిగరేట్‌లో కలిపి తీసుకునేలా కొత్తరకం మత్తు ద్రావణంను నిందితులు తయారు చేశారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి మత్తు ద్రావణం ఎక్కడి నుంచి తీసుకువచ్చారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

Related posts