telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

అంబులెన్స్‌లో కల్లు తరలింపు…నగరంలో ఇద్దరు అరెస్ట్

Ambulence

కరోనా కట్టడికి లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో మద్యం దుకాణాలు మూసివుండడంతో మందుబాబులు నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు అక్రమంగా కల్లును విక్రయిస్తున్నారు. హైద్రాబాద్ లో ఓ ప్రైవేటు అంబులెన్స్‌లో కల్లు తరలిస్తున్న ఇద్దరిని ఎస్సార్‌ నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.

బాపూనగర్‌కు చెందిన గణేష్‌, బాలకృష్ణ రెండు క్యాన్లలో 30 లీటర్ల కల్తీ కల్లు తీసుకొని బేగంపేట చేరుకున్నారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో బల్కంపేట చేరుకున్నారు. ఎస్సై సాయినాథ్‌, సిబ్బంది ఆ వాహనం సోదా చేయగా కల్లు తరలిస్తున్న విషయం బయటపడింది. ఈ ఘటనలో పోలీసులు వారిద్దరిని అరెస్టు చేసినట్టు తెలిపారు.

Related posts