telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మద్య నిషేధాన్ని దశలవారిగా అమలు చేస్తాం: మంత్రి నారాయణస్వామి

MLC Elections 3 days closed Liquor shops

మద్య నిషేధాన్ని దశలవారిగా అమలు చేస్తామని ఏపీ ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి అన్నారు. తిరుపతిలో శిక్షణ పూర్తిచేసుకున్న ఎక్సైజ్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పెరేడ్ లో మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి దశలో బెల్టు షాపులు పూర్తిగా ఎత్తివేసి, ఆ దుకాణదారులకు ఇతర రంగాల్లో ఉపాధి అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వానికి ముఖ్యమని చాటిచెప్పారు. మద్యపానానికి బానిసలైన భర్తలను పోగొట్టుకుని రాష్ట్రంలో ఎందరో మహిళలు వితంతువులు మిగిలిపోతున్నారని, అందుకే నవరత్నాల్లో భాగంగా హామీ ఇచ్చిన మద్య నిషేధానికి కట్టుబడి ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయం తమ ప్రభుత్వానికి అవసరంలేదని మంత్రి పేర్కొన్నారు.

Related posts