తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ పెంచుతున్నట్టు శనివారం ప్రకటించింది. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 3.144 శాతం డీఏ పెరగనుంది. మొత్తంగా 27.248 శాతం నుంచి 30.392 శాతానికి డీఏ పెరిగింది. పెరిగిన డీఏ 2018 జులై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది.