telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

దిశ ఎన్కౌంటర్ ను .. మద్దతు తెలిపిన వారిపై … చర్యలు.. !

disa accused encountered on escaping

దిశ కేసులో పోలీసులు చేసిన ఎన్కౌంటర్ సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఎన్ హెచ్ఆర్సీ విచారణ చేపట్టిన సంగతి కూడా తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై కేసులు నమోదు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విషయంలో సైబరాబాద్ పోలిస్ కమిషనర్ సజ్జనార్ కూడా వివరణ ఇచ్చుకుంటున్నారు. ఈ వ్యవహారంపై మరింత కూలంకషమైన విచారణ చేపట్టనుందనట మానవ హక్కుల సంఘం. అందులో భాగంగా దిశ నిందితులను ఎన్కౌంటర్ చేయడాన్ని సమర్థించిన ప్రముఖులందరికీ నోటీసులు ఇవ్వనున్నారని సమాచారం. పొలీసులు తమ ఆత్మరక్షణకు వారిని హతమార్చినట్టుగా చెబుతున్నారు. అయితే జనాలు అలా భావించడం లేదు. దిశపై అఘాయిత్యానికి పాల్పడినందుకే వారిని పోలీసులు చంపారు అనే మాట జనాల నుంచి వినిపిస్తుంది. పలువురు ప్రముఖులు కూడా అదే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వారిని కాల్చి చంపడాన్ని వారు సమర్థించారు. పోలీసులపై ఎదురుతిరిగి దాడి చేసినందుకు వారిని చంపడాన్ని కాకుండా దిశపై అఘాయిత్యానికి పాల్పడినందుకు వారిని పోలీసులు చంపారన్నట్టుగా ప్రముఖులు కూడా మాట్లాడారు. వారిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సినీ సెలబ్ర్టీస్ కూడా ఉన్నారు. బహిరంగ ఎన్కౌంటర్లను వాళ్లు అలా సమర్థించారు.

ఈ నేపథ్యంలో వారందరి జాబితానూ తయారు చేస్తోందట హక్కుల సంఘం. ఎన్కౌంటర్లను పోలీసులు విధించిన శిక్షను ఎలా సమర్థిస్తారంటూ.. వారిని ప్రశ్నించనుందట హక్కుల సంఘం. ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్ ను సమర్థించిన ప్రముఖులందరికీ నోటీసులు తప్పవని ఢిల్లీ వర్గాల సమాచారం. ఈ ఎన్కౌంటర్లను ప్రముఖుల కన్నా సామాన్యులు గట్టిగా సమర్థించారు. ఈ విషయంలో పోలీసులను యువతీయువకులు కూడా కీర్తించారు. మరి వారందరికీ కూడా మానవ హక్కుల సంఘం నోటీసులు ఇవ్వగలదా! అని నెటిజన్లు తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఇలా అడ్డుపడబట్టే అమ్మాయిలపై ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయని వాదిస్తున్నారు. ఇప్పుడు మైనర్లని అంటున్నారు. మరి అదే మైనర్లు ఒక ఆడ బిడ్డని అత్యంత కీచకంగా హింసించి హత్య చేశారు కదా, దానికి సమాధానం ఏమిటని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.

Related posts