ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన ఆయేషా మీరా హత్య కేసు విచారణ కీలక మలుపు తిరుగుతోంది. 12 ఏళ్ల తర్వాత ఆమె మృతదేహానికి సీబీఐ రీపోస్టుమార్టం చేయనుంది. సీబీఐ తమకు కూడా డీఎన్ఏ టెస్ట్ చేసిందని ఆయేషా తల్లిదండ్రులు చెబుతున్నారు.
ఆయేషా డీఎన్ఏ టెస్ట్కు తమ మతపెద్దలు ఒప్పుకోలేదని, కోర్టు ద్వారా సీబీఐ అనుమతి తెచ్చుకుందని తెలిపారు.టెస్టులకు తాము సహకరిస్తామన్నారు. అయేషా కేసులో దర్యాప్తు సంస్థలకు తాము సహకరిస్తూనే ఉన్నామని, తమకు పోలీసులు, కోర్టులు, రాజకీయ నాయకులపై నమ్మకం లేదని స్ఫష్టం చేశారు. తమకు సీబీఐ కూడా న్యాయం చేయకపోతే ఇక ఏ వ్యవస్థను ప్రజలు నమ్మరని తెలిపారు.