telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

మెట్రో రైలు కిందికి దూకి మహిళ ఆత్మహత్య

metro train hyd

ఢిల్లీలోని మెట్రో రైలు స్టేషన్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్లాట్‌ఫాంపై నుంచి రైలు కోసం వేచి చూస్తున్న 40 ఏళ్ల మహిళ రైలు వస్తున్న సమయంలో దాని కిందికి దూకి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన సోమవారం ఝందేవాలన్ మెట్రో రైలు స్టేషన్‌లో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైలు కిందికి ఓ మహిళ దూకిందని ఫోన్ వచ్చిందని, వెళ్లి చూసేసరికే ఆమె ప్రాణాలు పోయాయని పోలీసులు తెలిపారు. ఆమె వివరాలు తెలియరాలేదని, పోస్టుమార్టం కోసం ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు.

Related posts