telugu navyamedia
క్రైమ్ వార్తలు

ప్రేమించి పెళ్లి చేసుకున్నజంటపై దాడి .. బావ చెవి కొరికేసిన బామ్మర్ది.. కర్రలతో దాడి

ఏలూరు జిల్లాలోని ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై యువతి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.దెందలూరు మండలం చల్లచింతలపూడి గ్రామానికి చెందిన సాంబశివరావు, పావని మూడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

గత రాత్రి ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి శివార్లలోని ఓ రెస్టారెంట్‌లో పావని తమ్ముడు సాంబశివరావు చెవి కొరికాడు.. ఆమె తండ్రి కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో సాంబశివరావు తీవ్రంగా గాయపడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ‌లో రికార్డు అయ్యాయి. బాధితులు ద్వారకా తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాము ప్రేమించుకున్నామని.. పెద్దలు అంగీకరించకపోవడంతో.. మూడు నెలల క్రితం మేజర్స్ కావడంతో పెళ్లి చేసుకున్నామని సాంబశివరావు తెలిపారు. తమది సేమ్ కమ్యూనిటీ అని తెలిపారు. తాము ప్రస్తుతం అత్తగారి ఫ్యామిలీ వద్ద ఉంటున్నట్టుగా చెప్పారు

తాము రెస్టారెంట్‌కు వెళ్లామని తెలిసి.. పావని తండ్రి, సోదరుడు కూడా అక్కడికి వచ్చి తమపై దాడి చేశారని ఆరోపించారు. చంపేస్తామని బెదిరించినట్టుగా చెప్పారు. తమకు రక్షణ కావాలని కోరుతున్నట్టుగా తెలిపారు.  

Related posts