నైజీరియాలో విషాదం చోటుచేసుకుంది. ఓవో పట్టణంలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాథలిక్ చర్చ్లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.
ఆదివారం ఓండో రాష్ట్రంలోని ఓవోలో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిలో ప్రార్ధనలు చేసుకుంటున్నారు. ఆ సమయంలో చర్చిలో చొరబడ్డ ఓ దుండగుడు విచక్షణారహితంగా తుపాకులు, బాంబులతో విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్టు హతమర్చారు. మృతి చెందిన వారిలో చిన్నారులు, మహిళలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆదివారం కావడంతో ప్రార్ధనల కోసం భారీగా ప్రజలు వచ్చారు. చర్చి ప్రధాన పాస్టర్ను ముష్కరులు అపహరించి, కాల్పులు జరిపారు.
కాల్పుల జరిగిన అనంతరం పోలీసులు, రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని గాయపడిన వారితో పాటు మృతదేహాలను స్థానికంగా ఉన్న సెయింట్ లూయిస్ క్యాథలిక్ హాస్పిటల్కు తరలించారు.
దాడి జరిగిన ప్రదేశంలో నుంచి కొన్ని వీడియోలు ,ఫోటోలు బయటకు వచ్చాయి. ఇందులో చర్చి ఫాదర్ రక్తపు మడుగులలో పడి ఉండగా వారి చుట్టూ ఉన్న వ్యక్తులు ఏడుస్తూ కనిపిస్తున్నారు .కర్తసిక్తమైన ప్రాంతంలో ఘటన జరిగిన స్థలం భయానకంగా కనిపిస్తోంది.
Pray for Nigeria 🇳🇬 💔😭😭 #NigeriaIsBleeding pic.twitter.com/2maPbMLIvw
— Glorious samuel❤️ (@Glorioussamuel2) June 6, 2022