ములుగు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆ జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. వెంకటాపురం మండలం అలుబాకకు చెందిన టీఆర్ఎస్ నేత మూడురి బీమేశ్వర్ను కిరాతకంగా హతమార్చారు. ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిని బీమేశ్వర్ను బయటకు పిలిచి కత్తులతో విచక్షణ రహితంగా పొడిచారు. అర్థరాత్రి భీమేశ్వర్ ఇంటికి వచ్చిన మావోయిస్టులు అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్లాలి డబ్బులు కావాలంటూ పిలిచారు. ఇంత రాత్రి వేళ తన దగ్గర లేవన్న అతను డోర్ తీయకుండా అలానే ఉండిపోయాడు.
దీంతో మావోయిస్టులు గన్లతో డోర్ను కాల్చి…. బీమేశ్వర్ను బయటకు తెచ్చారు. ఆ తర్వాతతో కత్తులతో దారుణంగా పొడిచారు. తనను చంపొద్దని ఎంత వేడుకున్నా కనికరించలేదు. రక్తపు మడుగులో పడి ఉన్న భీమేశ్వర్ ప్రాణాలు కోల్పోయాడు. ఘటన సమయంలో మృతుడితో పాటు అతని భార్య ఉన్నట్లు తెలుస్తోంది.ఘటనా స్థలంలో ఓ లేఖను వదిలివెళ్లారు. అధికార పార్టీలో కొనసాగుతూ… అమాయక ప్రజలను దోచుకుంటున్నారని లేఖలో రాశారు. టీఆర్ఎస్, బీజేపీ నాయకులు తమ పదవులకు రాజీనామా చేయాలని..లేదంటే వారికి కూడా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. అయితే ఈ కేసుపై పోలీసులు ఇప్పటికే అలర్ట్ అయ్యారు.