ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా వివిధ జిల్లాలో సోలార్ పంపుసెట్లు ధ్వంసం చేస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం గోనెపూడి వద్ద దుండగులు సోలార్ పంపుసెట్లను ధ్వంసం చేశారు. గోనెపూడి శివారు ప్రాంతంలోని వ్యవసాయభూముల్లో ఉన్న 2 సోలార్ పంపుసెట్లపై తమ ప్రతాపం చూపించారు.
వీటి విలువ రూ.4 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతేగాకుండా, రూ.50 వేల విలువైన మోటార్ ను బావిలో పడేశారు. దీనిపై స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ చర్యలకు పాల్పడ్డవారి పై గ్రామస్థులు మండిపడుతునారు. పంపుసెట్లు ధ్వంసంతో తాము వ్య్వసాయ పనులు చేసుకోలేకపోతున్నామని బాధితులు వాపోతున్నారు.