దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ నేత వేం నరేందర్రెడ్డి మంగళవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో వేం నరేందర్రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన 50 లక్షల రూపాయలు లెక్కలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.
నాలుగునర్న కోట్లు ఎక్కడివంటూ బ్యాంకు అకౌంట్స్ ముందు ఉంచి మరీ ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. అటు మనీ ల్యాండరింగ్ వ్యవహారంపైనా అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ఈ కేసులో కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి, ఉదయ్సింహను ఈడీ విచారించిన విషయం తెలిసిందే.ఆదాయ పన్ను, అవినీతి నిరోధక శాఖ ఇచ్చిన సమాచారంతో ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ రాజ్ శేఖర్ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతోంది. నరేందర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు కీర్తన్ రెడ్డి కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు.
టీఆర్ఎస్ సర్కార్పై రేవంత్ ఫైర్