బీటెక్ పూర్తవ్వడంతో ఎంఎస్ చేయడానికి కెనడా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న మేరెడ్డి స్ఫూర్తి (21) సొంత కారులో వెళ్లి మృతదేహంగా తిరిగి ఇంటికి వచ్చింది. ఈ విషయం తెలిసి ఆమె తల్లిదండ్రులు మేరెడ్డి నరేందర్-వాణి కన్నీరుమున్నీరవుతున్నారు. బొమ్మలరామారం వద్ద జరిగిన ప్రమాదంలో చనిపోయిన మేరెడ్డి స్ఫూర్తిది ఎల్బీనగర్ రాక్టౌన్ కాలనీ. శ్రీఇందూ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతోంది. తండ్రి నరేందర్రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి. స్నేహి తులంతా వీడ్కోలు వేడుకలు నిర్వహించుకుంటుండడంతో మంగళవారం ఉదయం సొంత కారులో వెళ్లింది. అక్కడ జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడింది. దీంతో రాక్టౌన్ కాలనీలో విషాదం అలముకొంది. బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో వచ్చి నివాళుల ర్పించారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి సన్నిహితుడు కావటంతో ఆయనతో పాటు పలువరు రాజకీయ నేతలు కూడా స్ఫూర్తి ఇంటికి వచ్చి పరామర్శించారు. కోమటిరెడ్డి కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని కన్నీరుమున్నీరుగా విలపించినట్లు సన్నిహితులు తెలిపారు. కాగా నరేందర్రెడ్డిది నల్గొండ జిల్లా ఏపీలింగోటం సొంత ఊరు. స్ఫూర్తి మేనమామ దేదేందర్రెడ్డి న్యూజి లాండ్లో ఉండడంతో ఆయన వచ్చేంత వరకు మృతదేహాన్ని కామినేని ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. గురువారం అంత్యక్రియలు జరగవచ్చునని బంధువులు తెలిపారు.
previous post