telugu navyamedia
ఆంధ్ర వార్తలు

గుంటూరులో దారుణం – బొడ్డుతాడు తిని ఓ ఇల్లాలి మృతి

కంప్యూట‌ర్ యూగంలో కూడా మూడ న‌మ్మ‌కాలు ఎక్కువైపోయాయి. తాజాగా పిల్లలు కలగలేదని ఇల్లాలికి ఓ నిండు ఇల్లాలు ప్రాణం తీసింది మూడ‌న‌మ్మ‌కం.

వివరాల్లోకి వెళ్తే..

ఆంద్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం తూబాడుకు చెందిన రవికి, సన్నితకు రెండేళ్ళ క్రితం వివాహం జరిగింది. అయితే వీరికి పిల్లలు కలగలేదు. దీంతో బొడ్డు తాడు తింటే పిల్ల‌లు పుడ‌తార‌ని బంధువులు బలవంతం చేశారు.

ఒక పక్క పిల్లలు కలగడం లేదన్న సూటిపోటి మాటలు.. మరోవైపు వారు చెప్పిన మాట వినకపోతే కాపురంలో కలతలు వస్తాయేమో అన్న భయాలు.. దీంతో ఆ ఇల్లాలు వద్దని చెప్పలేకపోయింది.

రెండు రోజుల క్రితం బంధువులు సన్నితకు బొడ్డు తాడు తినిపించారు. దీంతో ఆమె తీవ్ర అస్వస్థతకు లోనైంది. తీవ్ర అనారోగ్యంతో బారిన ప‌డ‌డంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సన్నిత మృతి చెందింది.

అయితే బంధువులు బొడ్డుతాడు తినిపించడం వల్లే తన కూతురు చనిపోయిందంటూ మృతురాలి తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీనిమీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చేస్తున్నారు.

Related posts