టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు పై విరుచుకుపడ్డారు.
‘మీరు అంత నిప్పు, పత్తి గింజ అయితే అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగనే లేదు. మా అందరికీ ఒకేసారి కల వచ్చి 4 వేల ఎకరాల భూములను కొనుగోలు చేశామని చెప్పండి’ అని ట్వీట్ చేశారు.
ఇన్సైడర్ ట్రేడింగ్ పై దర్యాప్తు జరిపి, తమపై పడిన నిందను తొలగించమని సీబీఐని కోరండని అన్నారు. మీరు ఏమీ చేయకపోతే ఎందుకంత భయపడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు నిన్న నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ సంతాప సమావేశంలా ఉందని విజయసాయి ఎద్దేవా చేశారు.
ఇక నుండి కర్ణాటకలో కొత్త తరహ అభివృద్ది: బీజేపీ నేత యడ్యూరప్ప