ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్, తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం రణబీర్ సింగ్ దంపతులకు టిటిడి అర్చకులు, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్… ఎల్వోసీ దగ్గర ఇండియన్ ఆర్మీ అప్రమత్తంగా ఉందని తెలిపారు. ఎలాంటి దాడులైన తిప్పికొట్టేందుకు తాము సిద్దంగా ఉన్నామని వెల్లడించారు.