telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్

శ్రీవారి సేవలో.. ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్..

army officer ranabir singh visit tirumala

ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్, తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం రణబీర్ సింగ్ దంపతులకు టిటిడి అర్చకులు, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్… ఎల్‌వోసీ దగ్గర ఇండియన్ ఆర్మీ అప్రమత్తంగా ఉందని తెలిపారు. ఎలాంటి దాడులైన తిప్పికొట్టేందుకు తాము సిద్దంగా ఉన్నామని వెల్లడించారు.

Related posts