నేడు నారా చంద్రబాబునాయుడు కడపలో నిర్వహించనున్న రోడ్షో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా పాల్గొనబోతున్నారు. కడప నుంచి టీడీపీ అభ్యర్థిగా అమీర్బాబు బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ముస్లింలు అధికంగా ఉన్న కడపలోని గోకుల్ సెంటర్ నుంచి చంద్రబాబు రోడ్షో ప్రారంభించనున్నారు.
ఫరూక్ అస్మాస్పేట బహిరంగ సభలో ప్రసంగించనున్నట్టు నేతలు తెలిపారు. రాష్ట్రంలో ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లో అబ్దుల్లా ప్రచారం నిర్వహిస్తారని పేర్కొన్నారు. 1991 ఎన్నికల ప్రచారంలోనూ ఫరూక్ అబ్దుల్లా ఏపీలో ప్రచారం చేశారు. అప్పట్లో ఎన్టీఆర్తో కలిసి ఆయన కడప, కమలాపురం నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. 27 ఏళ్ల తర్వాత ఫరూక్ మళ్లీ కడపకు రానుండడం గమనార్హం.
ఇప్పడు మోదీలో భయం కనిపిస్తోంది: రాహుల్