ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించిన సినిమా పుష్ప: ది రైజ్ . ఎర్ర చందనం స్మింగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ల కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా ఇది.
తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ బాషల్లో కూడా ఈ సినిమా డిసెంబర్ 17నే విడుదలైంది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. ఇండియాలోనే కాదు అమెరికన్ బాక్సాఫీసు వద్ద కూడా పుష్ప కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
ఈ క్రమంలో ఈ మూవీ నుంచి బిగ్ అప్డేట్ బయటకు వచ్చింది. పుష్ప మూవీని స్ట్రీమింగ్ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు కొనుగోలు చేశారట.. 2022 సంక్రాంతి కానుగా డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు పుష్ప అమెజాన్ ప్రైంలోకి రానుందట.
మరి ఇది అన్ని భాషలకి కలిపా లేక ఒక్క సౌత్ ఇండియన్ భాషలు వరకే సొంతం చేసుకున్నారా అనేది త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
చిరు అబద్ధం చెప్పారు… చరణ్ నిజం చెప్పారు : ఉయ్యాలవాడ వారసులు